Tuesday, May 20, 2025

సాధన శిబిర ముగింపు

ముగిసిన జ్ఞానసరస్వతి పౌండేషన్ సాధన శిబిరం*
ముఖ్య అతిథిగా పాల్గొన్న సీబీఐ మాజీ డైరెక్టర్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ..
ప్రతిభావంతులకు సరైన సమయంలో చేయూత అందిద్దాం అనే సదాశయ స్ఫూర్తితో...
ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులను వారికి అభిరుచి ఉండి, ప్రతిభ ఉన్న అంశంలో ఎంపిక చేసి సంవత్సరంలో 60 సెలవు రోజులలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రారంభించింది GSF. అందులో భాగంగా ఈ సంవత్సరం కబడ్డీ, వాలీబాల్ & పెయింటింగ్ అంశాలలో ఎంపిక చేసిన ప్రభుత్వ బడుల విద్యార్థులకు ఏప్రిల్ 26 నుండి మే 20వరకు సాధన శిబిరం(రెసిడెన్షియల్ Camp)నిర్వహించబడింది.
  ఈ శిబిరంలో పాల్గొన్న  విద్యార్థులకు  Dress code తో అన్ని వసతులు ఉచితంగా అందిస్తూ, నిష్ణాతులైన శిక్షకులచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జరిగింది 
ఈ రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి శ్రీ JD లక్ష్మీనారాయణ గారు, (Retd IPS, Ex JD CBI) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థుల పాటలు, నినాదాలు మరియు వారి అనుభవాలు విని అద్భుత శిక్షణ ఇవ్వబడింది అని ప్రశంసలు కురిపిoచారు.
విద్యార్థులతో చాలా సేపు ముఖా ముఖి నిర్వహించారు.. ధ్యాన్ చంద్, ధోనీ, మిల్కా సింగ్ వంటి క్రీడాకారుల జీవితాల ఉదాహరణలు తెలుపుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతర ప్రయత్నం సాగాలన్నారు, అలాంటి ప్రయత్నం సాధన కుటీర్ లో జరుగుతుంది అని తెలిపారు. విద్యార్థులకు సరైన సమయంలో ఇలాoటి చేయూత అద్భుతాలు సృష్టించగలరని నమ్మి, నిరంతర శిక్షణ అందుతున్న GSF సదా వెంకట్ గారి సేవలను అభినందించారు. ఇలాంటి ప్రయత్నానికి సమాజం అండగా నిలబడాలి, మా వంతు కూడా సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో గత సంవత్సరంలో 60రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు LEVEL 1 COMPLETION పేరున Certificates అందజేశారు. 
GSF Founder సదా వెంకట్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన ఆర్థిక నిరుపేద విద్యార్థులకు GSF SAC ద్వారా ఎంపిక చేసి నిరంతర శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు.  కార్యక్రమంలో  మాజీ MEO శ్రీనివాస్ గారు, వాలీబాల్  భారత మాజీ క్రీడాకారుడు శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రమోద GSF సాద్రి ఇచార్జ్ మరియు GSF కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment