సాధన కుటీర్ లో అట్టహాసంగా ప్రారంభమైన వివేకా బ్యాడ్మింటన్ టోర్నీ* - 2026.
టీం శతాబ్ది ఆధ్వర్యంలో *వందేమాతరం రచించబడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్, కలాం ఫౌండేషన్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ సహకారంతో "వివేకా బ్యాట్మింటన్ టోర్నమెంట్" ను అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది*
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ నాగయ్య గారు, ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ అచ్చుత్ గారు పాల్గొనడం జరిగింది.
టోర్నమెంట్ ని ఉద్దేశించి వచ్చిన పెద్దలు బ్యాడ్మింటన్ ఆట ద్వారా యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని, అదే మాదిరిగా మధ్య వయస్సు ఉన్న వాళ్లకు ఫిట్నెస్ లెవెల్స్ పెంచుతుందని, క్రీడల ద్వారా దేశ ప్రతిష్టత పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ క్రీడా కారుల ప్రతిభను గురించి ప్రోత్సహించాలనే సదాశయ స్పూర్తితో GSF ద్వారా క్రీడా శిబిరాలు నిర్వహించ బడుతున్నాయి. అదే స్పూర్తితో ఈ అద్బుత టోర్నమెంట్ కోసం సాధన కుటీర్ వేదిక కావడం మంచి అవకాశంగా భావిస్తున్నామని GSF సాదనా కుటీర వ్యవస్థాపకులు, సదా వెంకట్ గారు తెలిపారు.
టోర్నమెంట్ లో 60 టీమ్స్ రెండు విభాగాల్లో వయస్సు 40లోపు మరియు 40 పై పాల్గొనడం జరిగింది.
ఈ రోజుతో లీగ్ మ్యాచ్స్ ముగియడం జరిగింది.
jan 6 మంగళవారం రోజు ఉదయం ఫైనల్స్ నిర్వహించిన తర్వాత గెలిచిన వారికి 2 విభాగాల్లో మొదటి బహుమతి ₹5000/- రెండవ బహుమతి ₹2000/– తో పాటు మేమెంటోస్, ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో కలాం ఫౌండేషన్ సభ్యులు బుచ్చయ్య గారు, టేకీ రైడ్ ప్రతినిధులు మహేష్ గరినే మరియు టీం శతాబ్ది సభ్యులు 40 మంది పాల్గొనడం జరిగింది.
:~ టీమ్ శతాబ్ది.