Tuesday, August 25, 2026

గోపాల్ జీ @ పద్యాల తోరణం

పద్య పఠన పోటీలతో
సాహితీ  గుబాలింపు
శతక పద్యాల ధారణ తో నైతిక విలువల  పెంపుకు కృషి 

పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 
విద్యార్థులకు పద్యాల పోటీ లు


భవిష్యత్ తరాలకు తెలుగు భాషలోని సాహితీ సొగసు ను పద్యంలోని మాధుర్యంను
పట్టణ పల్లెల్లో వ్యాపింప చేయడానికి తెలుగు భాష బోధకులు నడుంబిగించారు. పద్యాల  తోరణం పేరిట పద్య పఠన పోటీలను పాఠశాల స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతి  శ్రేణిగా  పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లాస్థాయిలలో పోటీలను నిర్వహించి పద్యం యొక్క గొప్పతనాన్ని పద్య పఠనం యొక్క ఆవశ్యకతను ధారణ శక్తిని. చాటడానికి  ఉద్యుక్తులవుతున్నారు

 రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ సౌజన్యంతో
అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక  రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ ల సౌజన్యంతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్  పద్యాల తోరణం కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది

 పద్యం ద్వారా నైతిక విలువలను ప్రబోధిస్తూనే  సుశిక్తులైనటువంటి ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుటకు పద్య పటన పోటీలు దోహదం చేస్తాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా రంగారెడ్డి జిల్లాలో సాహితీ సౌరభాన్ని మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతం వరకు వ్యాపింప చేయాలని తెలుగు భాషాభిమానులు భావిస్తున్నారు. 

ప్రముఖ సాహితీవేత్త విద్యావేత్త అనంత సాహితీ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులు దోరవేటి చెన్నయ్య. జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సదా వెంకట్,
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు భవాని జగదీశ్వర్ రెడ్డి. ల
పర్యవేక్షణలో పద్య పఠన పోటీలకు పాఠశాల స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు.

జిల్లాలోని 27 మండలాలలో గల సాహితీ ప్రముఖులను ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగు భాష సాహితికి  పద్యం ఒక కోహినూర్ వజ్రం లాంటిదని  పద్యం యొక్క రసస్వాదనం ను విద్యార్థులలో పెంపొందింప చేయడానికి రంగారెడ్డి జిల్లాలో గొప్ప ప్రయత్నం చేస్తున్నట్లుగా  సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు పద్యాల తోరణం సమన్వయ సమితి సభ్యులు రంగరాజు శానమోని నర్సింహులు వెంకటస్వామి. మహేందర్ జగన్ నందిగామ కిషోర్  కుమార్ . వెంకటేశం 
బి శంకరయ్య ఎం డి బషీర్  చైతన్య భారతి భువనేశ్వరి కిషన్ చౌహాన్ బుచ్చయ్యా జయ ప్రకాష్ 
 మల్లికార్జున్ చుక్కా శ్రీనివాస్ ఆశీర్వాదం రాములు సుధాకర్ రెడ్డి కమలేష్ శంకరయ్యా 
లు  కృషీ చేస్తుండగా . పోతన వేమన  శ్రీనాథుడు కంచర్ల గోపన్న  బద్దెన మారద వెంకయ్య  లాంటి మహా కవుల పద్యాల తో పాటు 
రామాయణ మహాభారతం లాంటి ఇతిహాస గ్రంధాల నుంచి ప్రసిద్ధ పద్యాలను నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నాలుకలపై ఆడుతున్నాయని వారు వివరించారు.

ప్రతి పాఠశాల నుంచి ఖచ్చితంగా విద్యార్థులు పాల్గొనే విధంగా పాఠశాల స్థాయిలో తరగతికి ఇద్దరు చొప్పున ఎంపిక  చేస్తూనే వారిలో సాహితీ గుబాలింపును పెంపొందిస్తూ మంచి బహుమతులతో  ప్రోత్సహించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. 
రంగారెడ్డి జిల్లా సాహితీ సౌరభాన్ని చాటుతూనే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చొరవతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా మార్గదర్శనం కోసం జిల్లా తెలుగు బోధకులు సాహితీ అభిమానుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 
సెప్టెంబర్ చివరివారం నాటికి   పద్య పటన పోటీలు నిర్వహించనున్నారు. 

ప్రతి గ్రామంలోని కవులు కళాకారులు పధ్య రచయితలు గేయాల రచయితలను  భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాన్ని ఖరారు చేశారు.

కె గోపాల్ జి 
కవి రచయిత 
సీనియర్ నేత
రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యు పి పి టి ఎస్)

Tuesday, August 11, 2026

PSSR LAXMI ji Session

✨ *Inspiring Interactive Session for GSF Sadhana Camp Students* ✨
On 10 August 2026, an inspiring and interactive session was held for the GSF Sadhana Camp students with 
*Smt. P.S.S.R. Lakshmi garu, Retd. Director, Ramananda Tirtha Rural Institute.*
Addressing the students, 
Smt. Lakshmi garu emphasized that concentration is essential for success and must be consciously developed by every individual. She highlighted the immense potential of the human brain and advised students to fill their minds with positive thoughts and constructive ideas.
She further explained that when a person remains firmly focused on a goal and works towards it with continuous dedication and determination, nature itself creates the circumstances that support success. She also encouraged the students to respect their traditional occupations and integrate modern technology to develop and strengthen them.
Sri. Radha Krishna garu, Retd. Chairman, SBI, advised the students to respect their parents and value their mothers’ guidance. He encouraged them to choose successful personalities as their role models, study their lives and achievements, and draw inspiration from their journeys.

He also urged the students to make the fullest use of the valuable opportunity provided by GSF and strive for excellence in every sphere of life.

The session was also attended by GSF Founder Shri Sada Venkat garu, GSF Saadri In-charge Smt. Pramoda, Sadhana Camp Member Smt. Sridevi, GSF Sadhana Sports Coaches.
🌱 *Such interactions inspire young minds to dream big, think positively, stay focused, respect their roots, and work relentlessly towards excellence.*

:~ GSF Sports wing

Friday, August 7, 2026

సాకులు విజయాన్ని సృష్టించవు

వ్యక్తిత్వం లేని ప్రతిభ ప్రమాదకరం.ప్రతిభ లేని వ్యక్తిత్వం అసంపూర్ణం.

వ్యక్తిత్వం – ప్రతిభ రెండూ కలిసినప్పుడే మనిషి నిజమైన మహోన్నతుడవుతాడు.

అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి...

మన ప్రతిభను, మన వ్యక్తిత్వాన్ని ఎదగనివ్వడం గానీ, ఎదగకుండా ఆపడం గానీ మరెవరి చేతుల్లో ఉండదు. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

"అవకాశాలు రాలేదు...",          "ఎవరూ ప్రోత్సహించలేదు...", "పరిస్థితులు అనుకూలించలేదు...", "వాళ్ల వల్ల నేను ఎదగలేకపోయాను..." అంటూ     కుంటి సాకులు చెప్పుకుంటూ కాలాన్ని వృథా చేసుకోవద్దు.

ఎందుకంటే... సాకులు విజయాన్ని సృష్టించవు; సాధనే విజయాన్ని సృష్టిస్తుంది.
నెపాలు వ్యక్తిత్వాన్ని నిర్మించవు; బాధ్యత నిర్మిస్తుంది.

ప్రతిరోజూ మనల్ని మనం కొంచెం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగితే, ఒక రోజు మనమే మన విజయానికి నిదర్శనంగా నిలుస్తాం.


సాకులు చెప్పడం ఆపేద్దాం...బాధ్యతను స్వీకరిద్దాం...

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుందాం...

ప్రతిభను పదును పెట్టుకుందాం...
ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ముందుకు సాగిపోదాం!

ఎందుకంటే...
మన జీవితానికి శిల్పి మనమే.
మన వ్యక్తిత్వానికి నిర్మాత మనమే.
మన విజయానికి బాధ్యులం కూడా మనమే.

Monday, August 3, 2026

కబంద వృక్ష ప్రతిష్ట

శ్రీ కదంబ వృక్ష ప్రతిష్ఠా యజ్ఞం
"వృక్షో రక్షతి రక్షితః" – వృక్షాన్ని రక్షించినవారిని వృక్షమే రక్షిస్తుంది.
అత్యంత శ్రమతో అడవి ప్రాంతాల నుండి సేకరించిన పవిత్ర శ్రీ కదంబ మొక్కలకు, పవిత్ర గోదావరి తీరాన వెలసిన బాసర 
శ్రీ జ్ఞానసరస్వతి దేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, అనంతరం వాటిని జ్ఞాన సరస్వతి సాధన కుటీర్‌కు అందిచబడ్డాయి. సామాజిక కార్యకర్త శ్రీ వనం కిరణ్ గారిచే సేకరించబడి  మొక్కలను శ్రీ విశ్వామిత్ర గారి ద్వారా సాధన కుటీర్‌కు అందించబడ్డాయి.
సాధన కుటీర్ లో వెలసిన  పరమేశ్వరుని సాక్షిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి,  సాధన కుటీర్ ప్రాంగణంలోని దేవతా వృక్షాల బిషనోయ్  వనంలో  కొన్ని మొక్కలను అలాగే అన్నపూర్ణ మండపం మరియు భారతమాత సన్నిధిలో  శ్రీ కదంబ వృక్షాలను నాటడం జరిగింది.
మహా మహిమాన్వితమైన శ్రీ కదంబ వృక్షము సాక్షాత్తు జగజ్జనని ఆదిశక్తి స్వరూపముగా భారతీయ సనాతన సంప్రదాయంలో అనాదికాలం నుండి ఆరాధించబడుతోంది. ఈ పవిత్ర వృక్షము ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతూ, మానవాళికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, విద్యా వికాసం, సంస్కార విలువలు ప్రసాదించునని విశ్వాసం.
కలియుగంలో ధర్మస్థాపన, దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సంస్కృతి పరిరక్షణ, లోకక్షేమం అనే మహత్తర సంకల్పంతో ఈ "శ్రీ కదంబ వృక్ష ప్రతిష్ఠా యజ్ఞం" ప్రారంభించబడుతోంది.
పవిత్ర గోదావరి తీరాన వెలసిన బాసరలో, శ్రీ వేదవ్యాస మహర్షి తపోబలంతో ప్రతిష్ఠించబడిన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు లోకక్షేమార్థం కొలువై ఉన్నారు*. 
*ఆ దివ్యక్షేత్రంలో ఆశీర్వదించబడిన ఈ పవిత్ర కదంబ వృక్షాలను దేశవ్యాప్తంగా నదీతీరాలు, పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, గోశాలలు, విద్యాలయాలు, సేవా కేంద్రాలు వంటి పవిత్ర ప్రదేశాలలో ప్రతిష్ఠిస్తూ ప్రకృతి పరిరక్షణ – ధర్మ పరిరక్షణ – లోక కళ్యాణం అనే మహోన్నత లక్ష్యంతో ఈ యజ్ఞాన్ని విస్తరింపజేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

ప్రతి కదంబ వృక్షం ఒక దేవాలయంగా...
నాటిన ప్రతీ మొక్క ఒక యజ్ఞంగా...
  ప్రతి సంరక్షకుడు ఒక ఋషిగా...
ప్రతి ప్రాంతం ధర్మక్షేత్రంగా వికసించుగాక!
లోకాః సమస్తాః సుఖినో భవంతు। సమస్త సన్మంగళాని భవంతు.
:~ సదా వెంకట్, GSF.