Monday, August 16, 2021

75th independence day celebration


 *75th IndependenceDay Celebrations @ GSF_Sadhana Kuteer*.


Hon'ble Guests:


*Smt. Padmavathi garu, JrCivilJudge, Ibrahimpatnam Court.*


*Smt.Challa Geetha Reddy garu, Chairperson, Medha Institutions*,


*Amgoth Tukaram Pawar , Mountaineer*.


Participants:


Team of

*BAR Association, IBP*, 

*Sada Shiva Yoga peetham members*, 

*GSF team members*, *Sadhana Sports Academy members*  and *Palle Aanimutyalu* were Participated in the Program.


~Team GSF

Friday, August 6, 2021

Hockey Federation of TS visit to Sadhana Sports Academy

 *Congratulations to Indian Hockey Team.* 


The phenomenal victory of




the Indian Hockey Team in the Tokyo Olympics by defeating Germany and won the (Bronze) medal for the nation after 41 years.  On this auspicious occasion, a winning rally was conducted in Ibrahimpatnam town. In this program, *Sri Konda Vijay Kumar, The chairman of the Hockey Federation of Telangana, Sri Praveen Kumar Reddy, Vice President of RR Dist., Bhasker Reddy, Secretary, Panduranga Reddy, Treasurer, and Sadhana Sports Academy Players* took part in this program.  


*After that, they visited GSF_Sadhana Kuteer and had a conversation with the Sadhana Academy players, and played volleyball*

Friday, June 25, 2021

సాయి కుంచనుండి మరో చిత్రం

కలలు కలలుగానే మిగిలిపోతే లాభంలేదు_అవి సాకారాన్ని దాల్చాలి, భావనలు భావనలుగానే మిగిలిపోతే లాభంలేదు_అవి నైపుణ్యంగా మారాలి. ఇలా కలలు పండటానికి, భావనలు నైపుణ్యాలుగా పరిణమించడానికి కావలసినవి అచంచలమైన ధీక్ష, అకుంఠిత సాధన..
మన శక్తి సామర్ధ్యాలు, విద్యా నైపుణ్యాలు ఇతరులపై గెలవడానికి కాదు. మనపై మనం గెలవాలి.:~ 

Wednesday, June 23, 2021

Article వ్యాసం.

సేవే సంకల్పం అనే హెడ్డిoగ్ తో 2010 ఈనాడు పత్రికలో జ్ఞానసరస్వతి సేవాసమితి & జ్ఞానసరస్వతి ఫౌండేషన్ విషయంలో వ్యాసం.  

Thursday, June 17, 2021

#కత్తెరసీతాఫలం

సీజన్ కి ముందే  మొదలుపట్టినట్టే..
ఏమి చేస్తం మరి ఉన్న 6 చెట్లకి నిండా కాసి, పండ్లయున కొన్ని కంటికి కనబడితే.. చెట్టుమీది పండు సితాఫలం ఎవరికి తినాలనిపించదూ... మేమూ అదే చేస్తున్నం... అప్పుడే మొదలు పెట్టినం.

Wednesday, May 26, 2021

Prakruthi Vanam Visit


A Day with GN Naidu in PRAKRUTHI VANAM

Every plant, every tree, every creeper, every stone, every picture is all wonderful there. It is a place of attention.

the words are not enough to explain the beauty of that Hard work and dedication towards organic farming and his interest

These are not the efforts of one, two years, it is of 30 years. every day, every minute he is busy on the farm to make it some more attractive. daily he works nearly about 12 to 14 hours in the field.

Today, with natural organic farming, he grows several crops on his 17-acre land.
*Without using a single drop of pesticide or insecticide, and using organic farming, water management techniques, and mixed cropping, It contains a wide variety of crops, vegetables, flowers, spices, aromatic plants, Medicinal plants, tropical leaves, and floral arrangement plants that are grown under 15-degree centigrade to 55-degree centigrade*
.
He not only restricted to his farm, he attended many conferences and seminars as a spoke person and motivated many farmers across many countries.  He is a polyglot, an ascetic monk who build a 
#PRAKRUTHINILAYAM.

 He is Gudivada Nagarathnam Naidu*, 68 years old, stills seem to be energetic youth. 

We Team #SadhanaKuteer* were astonished by listening to his story. He shared his experience in farming and he added that many universities are tied up with Naidu farm for research. He was awarded more than 400 awards at national and international level summits.

Now Naidu is supporting and guiding the #GSF_Sadhana Kuteer for making it beautiful by planting the saplings of flowers, fruits, and vegetables.
And finally, we learned many things at Naidu  organic farms.

Written by Sampath

Wednesday, April 7, 2021

KABADDI CHAMPIONSHIP @Kuteer.

ఆశలు ఆశయాలై వేళ్ళానుకుంటూ ఆశలు చిగురిస్తున్న వేళా... 
ఆశించినట్టే పల్లెఆణిముత్యాల ప్రతిభకు ఆడ్డా అవుతున్న సాధన కుటీర్...

TELANGANA STATE KABADDI CHAMPIONSHIP_2021.

Dist. Computation & State selections
 by SBSSF 

@ GSF_Sadhana Kuteer

Wednesday, May 22, 2019

GNANA PUSHKARAKU

GSF సభ్యులందరికీ  నమస్తే...

గ్రామీణ విద్యార్థుల వికాసంకోసం సంకల్పం చేసి, జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ద్వారా  పని ప్రారంభించి పుస్కర కాలం(12 సంవత్సరాలు) అవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

మన ద్వారా ఎంతమంది విద్యార్థులకు ఉపయోగం జరిగిందనేది మనము ఏనాడు లెక్కలు వేసుకోలేదు.. వేసుకోవాలనీ లేదు.
పని చేయడంలోనే మనం నిమగ్నం అవుదాం. ప్రతిభావంతులైన ఆర్థిక బీద విద్యార్థుల ప్రతిభను సమాజానికి అందించాలనే తాపత్రయంతో నిరంతర విద్యాయజ్ఞంలో మనం ఉందాం.

పుస్కర కాలంగా గ్రామీణ విద్యార్థుల వికాసంకోసం నిమగ్నమై చేసిన పనుల వలన మనకు  కొంత అవగాహన శక్తి పెరిగినమాట వాస్తవం. ఆ శక్తికి నిదర్శనమే మన *సాధన కుటీర్*.
క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ,
గ్రామీణ ప్రతిభావంతులకోసం నిర్మాణాత్మకంగా జరిగే కార్యక్రమాల నిర్వహణకు ఒక విశిష్ట స్థలం మన కుటీర్ కావాలి. *ప్రతిభావంతులైన ఆర్థిక నిరుపేదలకు ఒక భరోసా కేంద్రంగా కుటీర్ నిలవాలని ఆశిద్దాం*.  ఈ క్రమంలో మన  పనిని, పనిలో గుణాత్మకతను ఇంకా పెంచుకోవాలి.

పుస్కరకాలంగా మన కార్యక్రమాలకు నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలకు నిండు హ్రదయంతో ధన్యవాదాలు తెలుపుదాం. అలాంటి వారికి  ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.. *వెలకట్టలేని సమయ సమర్పణతో, నిండు మనస్సుతో కొంతమంది మన కార్యక్రమాలను నిర్వహించారు*. పరుస్థితులు, సమయాభావం వల్ల అందరు అన్ని సమయాలల్లో అంతే ఉత్సాహంగా ఉండకపోవచ్చు. కాని వారి హృదయంలో మన GSF కు ప్రత్యేక స్థానమనే చెప్పొచ్చు.
అదేవిధంగా ఇన్ని సం.రాల నుండి జరుగుతున్న మన కార్యక్రమాలకు అండగా ఉంటూ సహయసహకారాలు అందించిన వ్యక్తులకు, సంస్థలకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుదాం.
ఇక ముందు కూడా అంతే ఉత్సాహంగా మన పనులో ముందుకెలదాం.

*జ్ఞానపుస్కరాలు*:: 
మన సంస్థ ప్రారంభమై 12 సం.రాలు అవుతున్న సందర్భంగా *జ్ఞానపుస్కరాలు* పేరున *2020' డెసెంబర్ నెలలో ఉత్సవాలు* నిర్వహించాలి అలోచిస్తున్నాం.
విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్సవాలు నిర్వహించాలనేది ఆలోచన.
కావున ఉత్సవాల నిర్వహణకోసం  మనందరం ఉత్సాహంగా తయారు కావాల్సి ఉంటుంది. మన పూర్వ కార్యకర్తలను, పూర్వ విద్యార్థులను( Lakshyam Camp, Sadhana Camp, Sankalp Divas, DGP  Etc.), శిబిరాలలో మన విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులను, మనకు సహాయ సహకారాలు అందించిన ప్రతివ్యక్తిని & సంస్థని, మన శ్రేయోభిలాషులను ఈ ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి.  అందుకోసం మనందరం కొంత తయారి కావాల్సి ఉటుంది. అందరం సహకరిద్దాం.

2019 ఆగష్టు నెలలో
*పుస్కరాల సన్నాహక సమావేశం తో పాటు సాధన కుటీర్ లో మొక్కలు నాటే కార్యక్రమం & మనందరికి ప్రీతి పాత్రమైన, మన నిత్యచైతన్య మూర్తి "భారతమాత" విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమం ఉంటుంది*.
కావున మన దృష్టిలో ఉన్న మనవారందరినీ ఏకత్రీకరణ చేసే పనిలో మనమూ బాగస్తులమవుదాం. జ్ఞానపుస్కరాలకు సహకరిద్దాం.

      ఇట్లు
మీ శ్రేయోభిలాషి::
    సదా వెంకట్
Founder & Managing Trustee,
GNANA SARASWATHI FOUNDATION.

Thursday, November 1, 2018

Closing of #SADHANACAMP_2018

--దృఢ సంకల్పానికి గట్టి సాధన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు--పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం
--సాధన కుటీర్ లో సాధనా శిభిరం ముగింపు కార్యక్రమం

రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వినోబా నగర్ సాధన కుటీర్ ప్రభుత్వ బడుల్లో చదివే పల్లె అణిముత్యాల ప్రతిభకు సనేపట్టే మహోత్తర కార్యక్రమాన్ని గతకొన్ని సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ చేపడుతోంది.

పూర్వపు రంగారెడ్డి మరియు నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల విద్యార్థులకు పాటలు, యోగ, చిత్రలేఖనం, వ్యాసరచన మరియు ఉపన్యాసం అంశాలలో ఎంపిక చెసిన 60 మంది విద్యార్థులకు వారం పాటు ఈ సాధన శిబిరం కొనసాగింది.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారు , ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ జానపద గాయకులు మరియు రచయిత డా.శ్రీ బోనాల ప్రకాష్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లేశం గారు మాట్లాడుతూ దృఢ సంకల్పానికి గట్టి సాధన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని, దీనికి ప్రత్యక్షసాక్ష్యం తాను చేనేత రంగం లో ఆవిష్కరించిన ఆసుయంత్రమే అని విద్యార్థులకు వివరించారు.ఈ ఆసుయంత్ర సృష్టి తనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందని,ఫోర్బ్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండేలా చేసిందని, కానీ తాను చదివింది మాత్రం నల్లగొండ జిల్లా లోని ప్రభుత్వ బడిలో కేవలం 6వతరగతి వరకు మాత్రమే అని గుర్తు చేశారు.జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వారు విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను గుర్తించి, వారికి సుశిక్షితులచే శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అనీ,ఈ విధమైన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ జానపద గాయకులు & రచయిత డా.శ్రీ బోనాల ప్రకాష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా వివిధ విషయాలపై అవగాహన పెంచుకుని ఎదగాలని తెలిపారు,ఈ క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని మరువకూడదని తెలియజేశారు. ఈ విధమైన సదృఢ సంకల్పమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.
ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సదా వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిభ కల్గిన ఏ  విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదనీ, అలాంటి వారికి చేయూతను అందించడమే ఫౌండేషన్ లక్ష్యం అని తెలిపారు.

జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ ముద్దం వెంకటేశం గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదిగి నేటి సమాజానికి మార్గదర్శనం చేసేలా ఎదిగిన వ్యక్తులచే విద్యార్థులకు ప్రత్యక్ష ఇంటరాక్షన్ లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రత్యేక వైఖరులను ఏర్పరచడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం లో 75 మంది విద్యార్థులు, 15 మంది శిక్షకులు,20 మంది వాలంటీర్లు పూర్తిసమయాన్ని వెచ్చించడం జరిగిందని తెలిపారు.

ఈకార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాన్ని అందించిన వ్యక్తులకు& సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు,కవి& పాత్రికేయులు శ్రీ తిరునగరి శ్రీనివాస్ గారు, ఇబ్రహీంపట్నం మండలం విద్యాధికారి శ్రీ వెంకట్ రెడ్డి గారు,హయాత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు,నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, GSF వాలంటీర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు GSF తో అనుబంధం ఉన్న పూర్వవిద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు.

SADHANA CAMP_2018 INAUGURATION

Inauguration progrm of

#SADHANACAMP_2018

*--నిశ్శబ్ద ఉద్యమంగా కొనసాగుతున్న ఇలాంటి సంస్థల నిస్వార్థ సేవలు అభినందనీయం--తెలంగాణ ఉద్యోగస్తుల సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ దేవీ ప్రసాద్*

*--పల్లె అణిముత్యాల సాధన శిబిరం ప్రారంభం....*
ప్రభుత్వ బడుల్లో చదివే పల్లె అణిముత్యాల ప్రతిభకు సనేపట్టే మహోత్తర కార్యక్రమాన్ని గతకొన్ని సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ చేపడుతోంది. పూర్వపు రంగారెడ్డి & నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల విద్యార్థులకు పాటలు, యోగ, చిత్రలేఖనం, వ్యాసరచన మరియు ఉపన్యాసం అంశాలలో
ఎంపిక చెసిన 60 మంది విద్యార్థులకు వారం పాటు జరిగే సాధన శిబిరం ఈ రోజు సాధన కుటీర్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉద్యోగస్తుల సంఘం మాజీ అధ్యక్షులు, శ్రీ దేవీ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆద్యర్యంలో నిర్వహిస్తున్న ఈ సాధన శిబిరాల ద్వారా పల్లెల్లోని ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద ప్రతిభావంతులకు తప్పక దశ దిశ కలుగుతుందని అన్నారు.
ప్రచారాలకు దూరంగా ఉంటూ, నిశ్శబ్ద ఉద్యమంగా కొనసాగుతున్న ఇలాంటి సంస్థల నిస్వార్థ సేవల గూర్చి ఇంత ఆలస్యంగా తెలుసుకున్నందుకు కొంత బాదగా ఉందన్నారు. మా వైపు నుండి తప్పకుండా ఇలాంటి నిస్వార్ధ సంస్థలకు సహకారం అదింస్తానన్నారు.
ప్రారంభోత్సవంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్, శ్రీ రాజేందర్ రెడ్డి గారు, ప్రముఖ సినీ గేయ రచయిత డా. వెనిగల్ల రాంబాబు గారు, ప్రముఖ పాత్రికేయులు తిరునగరి శ్రీనివాస్ గారు, గురుకుల విద్యాపీఠ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఆయా అంశాల శిక్షకులు పాల్గొన్నారు.

సాధన కుటీర్ లో సమావేశ మందిరం కోసం నూతనంగా నిర్మించిన "SHED" ని కూడా అతితులతో ప్రారంబోత్సవం చేసారు.
ఆ నిర్మాణానికి సహరించిన దాతలు శ్రీ కొండల్ రావు గారిని, మరియు TECHI RIDE  సంస్థ ప్రతినిధులను ఫౌండేషన్ ద్వారా సన్మానించారు.

పల్లె బడులలోని ఆర్థిక నిరుపేద ప్రతిభావంతులకు సమాజం అండగా ఉండాలనే ఆశయంతో గత 10 సం.రాల నుండి ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆశయానికి అండగా ఉంటూ సహాయ సహకారలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలకు మరియు నిస్వార్దంగా సేవలు అందిస్తున్న కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థాపకులు సదా వెంకట్ గారు.
వారం రోజుల కోసం నిర్వహించే ఈ శిబిరంలో సుమారు 25 మంది కార్యకర్తలు పుర్తిసమయం ఉండటం విశేషం.

Meeting Hall_SHED Inauguration

Thanks to TECHI RIDE for Voluble Support.

Bhoomi Pooja for   Meeting Hall_SHED in #SADHANAKUTEER for  300 students.

Tuesday, September 4, 2018

RURAL GENIUS _ పల్లె ఆణిముత్యాలు.

పల్లెల్లోని ప్రతిభావంతులైన ఆర్థిక నిరుపేదల ప్రతిభను సరైన సమయంలో గుర్తించి, చేయూతను అందించే ప్రయత్నమే సాధన శిబిరాలు @ సాధన కుటీర్ #SADHANAKUTEER.